క్రీడాభూమి

రెండు కోట్ల నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 10: రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టిన మరియప్పన్ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నజరానాను ప్రకటించింది. రాష్ట్రానికి, దేశానికి పేరుప్రఖ్యాతులు ఆర్జించిపెట్టిన తంగవేలు విజయం యువతకు స్ఫూర్తినిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత్ ఒక ప్రకటనలో ప్రశంసించారు. భవిష్యత్తులో అతను మరిన్ని పతకాలు ఆర్జిస్తాడని, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం 75 లక్షలు: న్యూఢిల్లీ: స్వర్ణ పతకం సాధించిన పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 75 లక్షల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతిని ప్రకటించింది. దేశ కీర్తి ప్రతిష్టలను తంగవేలు ఇనుమడింప చేశాడని ప్రశంసించింది. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కాంస్య పతకం సాధించిన వరుణ్ భాటికి 30 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది.