క్రీడాభూమి

హెచ్‌ఐఎల్ టోర్నీ రాంచీలో ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ఫైనల్‌కు రాంచీ ఆతిథ్యమిస్తుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌ని కూడా అక్కడే నిర్వహించనున్నట్టు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 20న సెమీ ఫైనల్స్, 21న ఫైనల్ మ్యాచ్‌లను బిర్సా ముండా స్టేడియంలో జరపనున్నట్టు టోర్నీ షెడ్యూల్‌తోపాటు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోని ఆరు వేరువేరు కేంద్రాల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈనెల 18 మొదలయ్యే టోర్నీలో ఆరు జట్లు టైటిల్ కోసం ఢీ కొంటాయి. జేపీ పంజాబ్ వారియర్స్, ఢిల్లీ వేవ్‌రైడర్స్, కళింగ లాన్సర్స్, ఉత్తర్ ప్రదేశ్ విజార్డ్స్, దబాంగ్ ముంబయితోపాటు డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ జట్టు కూడా బరిలోకి దిగుతుంది. మొదటి మ్యాచ్ కళింక లాన్సర్స్, ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్ జట్ల మధ్య జరుగుతుంది.