క్రీడాభూమి

సాండా ఉషు ప్రపంచ కప్‌లో భారత జట్టుకు ఐదు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: చైనాలోని జియాన్‌లో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగిన సాండా ప్రపంచ కప్ ఎనిమిదో ఎడిషన్‌లో భారత ఉషు జట్టు ఐదు పతకాలను కైవసం చేసుకుంది. వీటిలో నాలుగు రజత పతకాలు, మరో కాంస్య పతకం ఉన్నాయి. గత ఏడాది ప్రపంచ ఉషు చాంపియన్‌షిప్ 13వ ఎడిషన్‌లో సత్తా చాటుకున్న 80 మంది ఉత్తమ సాండా ప్లేయర్లు పాల్గొన్న ఈ ఈవెంట్‌లో భారత్‌కు ఐదుగురు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. వీరిలో అర్జున అవార్డు గ్రహీత, ప్రపంచ చాంపియన్‌షిప్ సిల్వర్ మెడలిస్టు వై.సనతోయి దేవి భారత్‌కు రజత పతకాన్ని అందించింది. 52 కిలోల విభాగం ఫైనల్‌లో సనతోయి దేవి చైనా క్రీడాకారిణి లువాన్ జాంగ్ చేతిలో పరాజయం ఎదురవడంతో ఆమె రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. అలాగే ఈ ఈవెంట్‌లో భారత్‌కు 52 కిలోల విభాగంలో ఉచిత్ శర్మ, 60 కిలోల విభాగంలో సూర్య భాను ప్రతాప్ సింగ్, 56 కిలోల విభాగంలో మోనికా రజత పతకాలను అందించగా, 75 కిలోల విభాగంలో పూజా కదియన్‌కు కాంస్య పతకం లభించింది.