క్రీడాభూమి
చైనా బాడ్మింటన్ క్వార్టర్స్కు సింధు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఫజూ (చైనా), నవంబర్ 17: చైనా సూపర్ సింగ్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రెండో రౌండ్లో ఆమె అమెరికాకు చెందిన బివెన్ జాంగ్ను 18-21, 22-20, 21-17 తేడాతో ఓడించింది. మొదటి సెట్ను చేజార్చుకున్నప్పటికీ, ఆతర్వాత పుంజుకున్న సింధు అద్వితీయ పోరాట ప్రతిభను కనబరచింది. రెండో సెట్ను అతి కష్టం మీద సొంతం చేసుకుంది. చెరొక విజయంతో సమవుజ్జీలుగా నిలవడంతో, చివరిదైన మూడో సెట్ అత్యంత కీలకంగా మారింది. ఆ సెట్ను సింధు 21-17 ఆధిక్యంతో కైవసం చేసుకుంది.
పురుషుల సింగిల్స్లో అజయ్ జయరామ్ క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు. అతను రెండో రౌండ్లో వెయ్ నాన్ను 20-22, 21-19, 21-12 తేడాతో ఓడించాడు. ఈ మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠ రేపింది.