క్రీడాభూమి

భారత్ ‘డబుల్ హ్యాట్రిక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, డిసెంబర్ 4: ఆసియా కప్ మహిళల టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరోసారి ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 17 పరుగుల తేడాతో ఓడించి, వరుసగా ఆరోసారి టైటిల్‌ను సాధించింది. అరుదైన ‘డబుల్ హ్యాట్రిక్’ను నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 121 పరుగులు సాధించింది. అనంతరం పాకిస్తాన్ ఓవర్ల కోటా పూర్తయ్యే సమయానికి ఆరు వికెట్లకు 104 పరుగులు చేయగలింది. భారత వనే్డ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
టాస్ గెలచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మిథాలీ అండగా నిలిచింది. ఓపెనర్‌గా మైదానంలోకి వచ్చిన ఆమె వికెట్లు కూలుతున్నా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా ఆడి, 65 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఝాలన్ గోస్వామి 17 పరుగులు సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో అనామ్ అమీన్‌కు రెండు వికెట్లు లభించాయి.
అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు పరుగుల వేటలో తడబడింది. ఓపెనర్ జవెరియా ఖాన్ (22), సెకండ్ టౌన్ బిస్మా మరూఫ్ (25) తప్ప మిగతా వారు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్‌కు రెండు వికెట్లు లభించాయి. ఇప్పటి వరకూ మహిళల ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్ ఆరు పర్యాయాలు జరిగే, అన్నింటిలోనూ భారత్ విజేతగా నిలవడం విశేషం.

సంక్షిప్త స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 121 (మిథాలీ రాజ్ 73 నాటౌట్, ఝూలన్ గోస్వామి 17, అనామ్ అమీన్ 2/24).
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 104 (జవేరియా ఖాన్ 22, బిస్మా మరూఫ్ 25, అయేషా జాఫర్ 15, ఏక్తా బిస్త్ 2/22).

చిత్రం..ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి, ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌ను
కైవసం చేసుకున్న భారత క్రీడాకారిణుల విక్టరీ ల్యాప్