క్రీడాభూమి

సయ్యద్ మోదీ బాడ్మింటన్ ఫైనల్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 28: సయ్యద్ మోదీ స్మారక బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పివి సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో ఆమె 21-11, 21-19 తేడాతో ఫిట్రియానీని ఓడించి, జార్జియా మరిస్కాతో టైటిల్ పోరును ఖాయం చేసుకుంది. మరో సెమీ ఫైనల్‌లో మరిస్కా 21-19, 21-14 స్కోరుతో హన్నా రమాదినీపై విజయం సాధించి ఫైనల్ చేరింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు సమీర్ వర్మ, సాయి ప్రణీత్ తమతమ సెమీ ఫైనల్స్‌లో విజయాలను సాధించి ఫైనల్ చేరారు. సమీర్ 21-15, 21-11 ఆధిక్యంతో హర్షీల్ దనీపై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో హాట్ ఫేవరిట్ కిడాంబి శ్రీకాంత్‌ను సాయి ప్రణీత్ 15-21, 21-10, 21-17 తేడాతో ఓడించి ఫైనల్ చేరాడు.