క్రీడాభూమి
ఐపిఎల్ వేలంలో ఇశాంత్ కనీస ధర 2 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఓసం జరిగే ఆటగాళ్ల వేలంలో రూ.2 కోట్ల అత్యధిక బేస్ ధర కలిగిన ఏడుగురు ఆటగాళ్ల జాబితాలో మన దేశానికి ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఉన్నారు. ఈ జాబితాలోని మిగతా వారిలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్లు బెన్స్టోక్స్, క్రిస్ వోక్స్, శ్రీలంక జట్టు కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, ఆస్ట్రేలియా ఫాస్ట్బౌలర్ పాట్ కమిన్స్ ఉన్నారు. ఐపిఎల్ ఆటగాళ్ల వేలం ఈ నెల 20న బెంగళూరులో జరగనున్న విషయం తెలిసిందే. కాగా, కోటిన్నర రూపాయల విభాగంలో ఇంగ్లాండ్కు చెందిన జానీ బెయిర్స్టో, న్యూజిలాండ్కు చెందిన ట్రెంట్ బౌల్ట్, ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియోన్, బ్రాడ్ హాడిన్, దక్షిణాఫ్రికాకు చెందిన కైల్ అబోట్, వెస్టిండీస్కు చెందిన జాసన్ హోల్డర్ ఉన్నారు.