క్రీడాభూమి

ఆసియా ట్రాక్ సైక్లింగ్‌లో ఖాతా తెరిచిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ మహిళల టీమ్ స్ప్రింట్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుని తొలి రోజే ఖాతా తెరిచింది. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వెలోడ్రోమ్‌లో సోమవారం జరిగిన మహిళల టీమ్ స్ప్రింట్ ఈవెంట్‌లో కొరియాకు చెందిన జెయాంగ్ సియోల్హవా, హాజియూన్ జోడీని ఓడించి మూడో స్థానంలో నిలిచిన శశికళా అఘాషే, అనీలా రెజీ భారత్‌కు ఈ పతకాన్ని అందించారు. ఈ ఈవెంట్‌లో చైనాకు జట్టు 35.819 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, 36.623 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన చైనీస్ తైపీ జట్టు రజత పతకాన్ని, 36.677 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన భారత జట్టు కాంస్యాన్ని గెలుచుకున్నాయి. దీంతో 36.735 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన కొరియా జట్టు నాలుగో స్థానానికి పరిమితమైంది.