క్రీడాభూమి
క్వార్టర్స్లో శ్రీకాంత్, ప్రణీత్ ఢీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సిడ్నీ, జూన్ 22: ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ పోరాడనున్నారు. ప్రీ క్వార్టర్స్లో శ్రీకాంత్ 15-21, 21-13, 21-13 ఆధిక్యంతో సన్ వాన్ హోను ఓడించగా, మరో మ్యాచ్లో ప్రణీత్ 21-15, 18-21, 21-13 తేడాతో హువాంగ్ యు జియాంగ్పై విజయం సాధించి క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు. సెమీస్లో స్థానం కోసం వీరిద్దరూ పోటీపడతారు.
కాగా, మహిళల సింగిల్స్లో పివి సింధు, సైనా నెహ్వాల్ కూడా క్వార్టర్స్ చేరారు. సింధు ప్రీ క్వార్టర్స్లో చెన్ జియావోజిన్ను 21-13, 21-18 స్కోరుతో ఓడించి, తాయ్ జూ ఇంగ్తో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ని ఖాయం చేసుకుంది. సైనా 21-15, 20-22, 21-14 తేడాతో సోనియా చియా సుయాపై గెలిచింది. క్వార్టర్స్లో ఆమె సన్ యూను ఢీ కొంటుంది.