క్రీడాభూమి

యుపి యోద్ధపై యు ముంబా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 18: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో అంతర్-మండల పోటీల్లో భాగంగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో యు ముంబా మూడు పాయింట్ల తేడాతో యుపి యోద్ధపై విజయం సాధించింది. షాబీర్ బప్పు 13, అనూప్ కుమార్ 8, సురీందర్ సింగ్ 5 పాయింట్లతో రాణించడంతో యు ముంబా 37 పాయింట్లు సాధించింది. గాయం నుంచి కోలుకొని మళ్లీ బరిలోకి దిగిన బప్పు తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. అతని ప్రతిభే యు ముంబాను గెలిపించింది. కాగా, చివరి వరకూ గట్టిపోటీనిచ్చిన యుపి యోద్ధ తరఫున రిషాంక్ దేవాడిగ 14 పాయింట్లు చేశాడు. నితిన్ 7 పాయింట్లు సాధించాడు.
జైపూర్ విజయం
జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్ జట్ల మధ్య పోరు కూడా ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడడంతో, మ్యాచ్ ఎవరి పక్షాన ఉంటుందో తెలియని పరిస్థితి చివరి వరకూ కొనసాగింది. ప్రేక్షకులను అలరించిన ఈ మ్యాచ్‌లో జైపూర్ 30 పాయంట్లు సాధించి బెంగళూరును రెండు పాయంట్ల తేడాతో ఓడించింది. జైపూర్ ఆటగాడు జస్వీర్ సింగ్ 10 పాయంట్లు చేయగా, మన్జీత్ చిల్లార్ 8 పాయంట్లు సాధించాడు. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ 11 పాయంట్లతో రాణించాడు. మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

చిత్రం..13 పాయంట్లు చేసి యు ముంబాను గెలిపించిన షాబీర్ బప్పు