క్రీడాభూమి
టైటిల్ సాధించిన మార్టినా హింగిస్, చాన్ జువాన్ జాన్ జోడీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించిన మార్టినా హింగిస్, చాన్ జువాన్ జాన్ జోడీ. ఫైనల్లో వీరు హీస్ సూవెయ్, మోనికా నికలెస్క్యూ జోడీని 4-6, 6-4, 10-7 తేడాతో ఓడించారు. కాగా, పురుషుల సింగిల్స్ ఫైనల్లో నిక్ కిర్గియోస్, గ్రిగర్ దిమిత్రోవ్ మధ్య జరుగుతుంది. రాఫెల్ నాదల్పై విజయం సాధించి సంచలనం సృష్టించిన కిర్గియోస్ అదే పోరాట పటిమను కనబరుస్తూ, సెమీ ఫైనల్లో డేవిడ్ ఫెరర్ను 7-6, 7-6 తేడాతో ఓడించాడు. దిమిత్రోవ్ కూడా అదే స్కోరుతో జాన్ ఇస్నర్పై గెలుపొంది ఫైనల్ చేరాడు. మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ కోసం గార్బినె ముగురుజా, సిమోనా హాలెప్ ఢీ కొంటారు. సెమీ ఫైనల్లో ముగురుజా 6-3, 6-2 ఆధిక్యతో కరోలినా ప్లిస్కోవాపై విజయం సాధించింది. హాలెప్ 6-2, 6-1 తేడాతో స్లొయెన్ స్టెఫెన్స్ను ఇంటిదారి పట్టించి ఫైనల్ చేరింది. పురుషుల డబుల్స్ విభాగంలో పియెర్ హ్యూజెస్ హోబర్ట్, నికోలస్ మాహుత్ జోడీతో జమీ ముర్రే, బ్రూనో సొయెర్స్ జోడీ తలపడుతుంది.