క్రీడాభూమి

ఆసియా ఇండోర్ గేమ్స్‌లో మరో మూడు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అస్ఘబత్ (తుర్క్‌మెనిస్తాన్), సెప్టెంబర్ 19: తుర్క్‌మెనిస్తాన్‌లోని అస్ఘబత్‌లో జరుగుతున్న ఆసియా ఇండోర్ గేమ్స్, మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో భారత్ జోరు కొనసాగుతోంది. నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పోటీల్లో భారత్ మరో మూడు పతకాలను కైవసం చేసుకుంది. వీటిలో రెండు పసిడి పతకాలు, ఒక కాంస్య పతకం ఉన్నాయి. మంగళవారం భారత్‌కు పురుషుల 5000 మీటర్ల రేసులో గోవిందన్ లక్ష్మణన్, మహిళల 1500 మీటర్ల రేస్‌లో పియు.చిత్ర బంగారు పతకాలను అందించగా, పురుషుల 70 కిలోల రెజ్లింగ్ ఈవెంట్‌లో ధర్మేందర్ కాంస్య పతకాన్ని అందించాడు. దీంతో ఇప్పటివరకూ ఈ పోటీల్లో మొత్తం 7 (3 స్వర్ణ, 2 రజత, 2 కాంస్య) పతకాలు సాధించిన భారత్ తొమ్మిదో స్థానంలో నిలువగా, ఆతిథ్య తుర్క్‌మెనిస్తాన్ 39 స్వర్ణ, 27 రజత, 18 కాంస్య పతకాలతో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.