క్రీడాభూమి

టైటాన్స్, బెంగాల్ మ్యాచ్ టై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, అక్టోబర్ 20: తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్ మధ్య శుక్రవారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ టైగా ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఇరు జట్లు చెరి 27 పాయింట్లు సాధించాయి. టైటాన్స్ తరఫున నీలేష్ సాలుంకే ఏడు పాయింట్లతో టాపర్‌గా నిలిచాడు. ఎలెంగేశ్వరన్ ఆరు, రాహుల్ చౌదరి ఐదు చొప్పున పాయింట్లు చేశారు. బెంగాల్ ఆటగాళ్లలో జాంగ్ కున్ లీ ఎనిమిది పాయింట్లు సాధించారు. సుర్జీత్ సింగ్, దీపక్ నర్వాల్ చెరి ఐదు పాయింట్లు నమోదు చేశారు.
దాదాపు ఇదే తరహాలో ఉత్కంఠ భరితంగా సాగి మరో మ్యాచ్‌లో గుజరాత్ ఫార్ట్యూన్‌జెయింట్స్ ఒక పాయింట్ తేడాతో పునేలీ పల్టన్‌పై గెలిచింది. గుజరాత్ 23 పాయింట్లు చేయగా, గట్టిపోటీనిచ్చిన పునేరీ 22 పాయింట్లు సాధించింది.