క్రీడాభూమి

టీమిండియా ముమ్మర సాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 16: శ్రీలంకతో ఆదివారం ఇక్కడ జరిగే చివరి వనే్డలో తలపడేందుకు భారత జట్టు శనివారం ముమ్మరంగా సాధన చేసింది. గురువారమే నగరానికి చేరుకున్న టీమిండియా శుక్రవారమంతా హోటల్ గదులకే పరిమితమైంది. శ్రీలంక జట్టు శుక్రవారం ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వద్ద నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. తొలి రెండు వనే్డల్లో చెరో విజయం సాధించిన భారత్, శ్రీలంక సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో గెలిచేందుకు గట్టిగానే సాధన చేశాయి. చీఫ్ కోచ్ రవిశాస్ర్తీ ఆధ్వర్యంలో శనివారం రోహిత్‌శర్మ, మహేంద్రసింగ్ ధోనీ, దినేష్‌కార్తీక్, శిఖర్‌ధావన్, చాహాల్, అక్షర్‌పటేల్, శ్రేయాస్ అయ్యర్ తదితరులు ముమ్మరంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు.
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలిస్తుందని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.
మరోసారి ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. బౌలర్లకు పరీక్షపెట్టే ఈ పిచ్‌పై ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఎనె్నన్ని పరుగులు చేస్తారో చూడాలి.

చిత్రం..ముమ్మర సాధనలో భారత జట్టు