క్రీడాభూమి
మియామీ ఓపెన్ టెన్నిస్ ప్రీ క్వార్టర్స్కు సెరెనా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మియామీ, మార్చి 27: ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న మియామీ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్లో ఆమె జరీనా దియాస్ను 7-5, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. మొదటి సెట్లో గట్టిపోటీనిచ్చిన దియాస్ రెండో సెట్లో చేతులెత్తేసింది. కాగా, తర్వాతి రౌండ్లో స్వెత్లానా కుజ్నెత్సొవాను సెరెనా ఢీ కొంటుంది. కరోలినా గార్సియాను కుజ్నెత్సొవా 4-6, 6-2, 7-6 తేడాతో ఓడించింది. మరో మ్యాచ్లో ఎలినా స్విటోలినా 5-7, 6-4, 7-6 ఆధిక్యంతో ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకిపై విజయం సాధించింది. ప్రీక్వార్టర్ ఫైనల్స్లో ఆమె ఎకతరీన మకరోవాను ఢీ కొంటుంది. మకరోవా 6-4, 6-4 స్కోరుతో పెట్రా క్విటోవాపై ఇంటిదారి పట్టించింది. మాడిసన్ బ్రెంగిల్పై అగ్నిస్కా రద్వాన్స్కా 6-3, 6-2 తేడాతో సునాయసంగా గెలుపొంది ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. క్వార్టర్స్ ఫైనల్స్ చేరేందుకు ఆమె తిమియా బాక్సిన్జ్కీతో తలపడుతుంది. అంతకు ముందు జరిగిన మరో మూడో రౌండ్ మ్యాచ్లో బాక్సిన్జ్కీ 7-5, 6-4 తేడాతో అనా ఇవానోవిచ్ను ఓడించింది. చివరి ప్రీ క్వార్టర్ ఫైనల్లో హీతర్ వాట్సన్, సిమోనా హాలెప్ ఢీ కొంటారు. మూడో రౌండ్లో హీతర్ 3-6, 7-5, 6-3 తేడాతో యానినా విక్మేయర్పై, హాలెప్ 6-4, 6-1 స్కోరుతో జూలియా జార్జెస్పై విజయాలను నమోదు చేశారు.