క్రీడాభూమి
ఒడిదుడుకుల మధ్య మళ్లీ బరిలోకి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యాష్విల్లి, ఫిబ్రవరి 10: గడిచిన ఏడాది పాల్గొన్న వివిధ టోర్నీలలో ఎదురైన చేదు అనుభవాలు, ఒడిదుడుకుల నేపథ్యంలో మళ్లీ ఇపుడు ఆటపై దృష్టి సారించి బరిలోకి దిగనున్నానని ప్రఖ్యాత టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తెలిపింది. నార్త్ కరోలినాలో యాష్వెల్లిలో త్వరలో నిర్వహించే ఫెడ్ కప్ ద్వారా మళ్లీ తన ఉనికిని చాటుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్లో ఒక బిడ్డకు జన్మనిచ్చిన 36 ఏళ్ల టెన్నిస్ రాకెట్ తన ప్రాక్టీస్లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశానని, మరోపక్క తన సత్తా ఏమిటో రుజువు చేసుకునేందుకు మళ్లీ అవకాశం వచ్చిందని ఆమె అభిప్రాయపడింది. ఇపుడు ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లో అబుదాబీ ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఓటమిపాలైన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో కూడా కిరీటాన్ని కోల్పోయింది. కొన్ని పొరపాట్ల వల్ల పోయిన ఫాంను మళ్లీ కొనసాగించేందుకు ఈ ఏడాది జరిగే గ్రాండ్ శ్లామ్లు, ఫ్రెంచి ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ వంటివాటిల్లో సత్తా చూపుతానని ధీమా వ్యక్తం చేసింది.