క్రీడాభూమి

ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌కు సైనా, సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 26: కామనె్వల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్టు సైనా నెహ్వాల్, ఒలింపిక్ సిల్వర్ మెడలిస్టు పీవీ సింధు ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. చైనా షట్లర్ గావో ఫంగ్జీని 40 నిమిషాలపాటు జరిగిన పోటీలో 21-18, 21-8 తేడాతో ఓడించిన సైనా అద్భుత ఆటతీరును కనబరించింది. సైనా ఇక కొరియాకు చెందిన అన్‌సీడెడ్ లీ జంగ్ మీతో క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడుతుంది. మూడో సీడ్ పీవీ సింధు 21-12, 21-15 తేడాతో చైనాకు చెందిన చెన్ జియాక్సిన్‌ను ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడించింది. ఈమె తన తర్వాత మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ కొరియా క్రీడాకారిణి సంగ్ జి హైయున్ లేదా థాయిలాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫాన్‌తో పోటీ పడుతుంది. పురుషుల విభాగంలో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్, వరల్డ్ నెంబర్-10 షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ తమ తమ విభాగాల్లో ఎనిమిది స్టేజీలను అధిగమించారు. శ్రీకాంత్ తన తదుపరి మ్యాచ్‌లో చైనాకు చెందిన లీ చోగ్ వెయ్‌తో తలపడతాడు. ప్రణయ్ కొరియాకు చెందిన రెండో సీడ్ సన్ వాన్ హోతో తలపడతాడు.