క్రీడాభూమి

మన్‌దీప్‌కు గోల్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: మంగోలియా ఉలాన్‌బాటర్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో భారత బాక్సర్లు ఐదు పతకాలు కైవసం చేసుకున్నారు. మన్‌దీప్ జంగ్రా (69 కేజీలు) గోల్డ్ మెడల్‌ను సాధించాడు. మహిళల విభాగంలో సోనియా లాథర్ (57 కేజీలు), లవ్‌లినా బోర్గోహెయిన్ (69 కేజీలు), హిమాంశు శర్మ (49 కేజీలు), ఇతాష్ ఖాన్ (56 కేజీలు) సిల్వర్ పతకాలు అందుకున్నారు. అదేవిధంగా మరో నలుగురు భారత బాక్సర్లు కాంస్య పతకాలు గెల్చుకున్నారు. గోల్డ్ మెడల్ సాధించిన మన్‌దీప్ జంగ్రా పీటీఐతో మాట్లాడుతూ చాలాకాలం తర్వాత తాను అంతర్జాతీయ గోల్డ్ మెడల్ సాధించడంతో చాలా సంతోషంగా ఉందని, ఈ గెలుపుతో రానున్న ఆసియా గేమ్స్‌లో చోటు దక్కుతుందనే నమ్మకం ఉందని అన్నాడు. మన్‌దీప్ జంగ్రా కామనె్వల్త్ గేమ్స్‌లో రజత పతకం దక్కించుకున్నాడు.