క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్స్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, జూలై 12: ఒలింపిక్ రజత పతక విజేత, ప్రపంచ మూడో సీడ్, భారత షట్లర్ పీవీ సింధు ఇక్కడ జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో హాంకాంగ్‌కు చెందిన ఇప్ పుయ్ ఇన్‌ను 21-16, 21-14 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. సెమీ ఫైనల్స్‌లో చోటు కోసం శుక్రవారం అమెరికా క్రీడాకారిణి సోనియా చీహ్‌తో తలపడుతుంది. భారత షట్లర్లు పారుపల్లి కాశ్యప్, హెచ్.ఎస్.ప్రణయ్ ఆయా విభాగాల్లో జరిగిన మ్యాచ్‌లలో నిరాశపరిచారు. పురుషుల డబుల్స్‌లో భారత జోడీ మను అత్రి, బి.సుమీత్ రెడ్డి ప్రత్యర్థి జోడీతో హోరాహోరీగా తలపడినా ఓటమిని చవిచూశారు.