క్రీడాభూమి

న్యూజిలాండ్‌కు వైట్‌వాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-న్యూజిలాండ్ హాకీ ట్రై సిరీస్‌ను ఊహించినట్టే భారత్ సునాయాసంగా కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో గెలుపుతో ఆధిక్యంలోవున్న భారత్, బెంగళూరు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌ను 4-0తో వైట్‌వాష్ చేసి సిరీస్ కైవసం చేసుకుంది. ‘ఆసియా గేమ్స్‌కు ముందు ప్రపంచ టాప్ టెన్‌లోని జట్టుపై భారత్ సిరీస్ విజయం నమోదు చేయడం శుభపరిణామం. ఆసియా టోర్నీలో విజయాల నమోదుకు ఇది ఆరంభం కూడా. అన్ని కోణాల్లో ప్రణాళికాత్మక ప్రావీణ్యం ప్రదర్శించిన భారత జట్టు కొన్ని లోపాలనూ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది’ అని చీఫ్ కోచ్ హరీంద్ర సింగ్ వ్యాఖ్యానించాడు.

చిత్రం..న్యూజిలాండ్ గోల్‌పోస్టులోకి బంతిని తరలిస్తున్న భారత ఆటగాడు దిల్‌ప్రీత్ సింగ్.