క్రీడాభూమి
‘వైట్వాష్’ బాధాకరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చెన్నై, నవంబర్ 12: భారత్తో జరిగిన టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్ను 0-3తో కోల్పోవడం బాధాకరంగా ఉందని, అయినా తాము గట్టిగా పోరాడామని వెస్టిండీస్ కెప్టెన్ కార్లోస్ బ్రాత్వైట్ అన్నాడు. ఆదివారం ఇక్కడ జరిగిన టీ-20 ఫైనల్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించడంతోపాటు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. మూడు మ్యాచ్లను కోల్పోవడం విచారకరమే అయినా తన దృష్టిలో అది అత్యంత బాధాకరమైన అంశమని అన్నాడు. పొట్టి ఫార్మాట్ అయినా అవకాశాలను అందిపుచ్చుకుని తమ జట్టు సభ్యులు చివరివరకూ పోరాడారని పేర్కొన్నాడు. టీ-20లో తొలి గేమ్లో తాము ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చామని, రెండో గేమ్లోనూ బాగానే ఆడామని, మూడో మ్యాచ్లో బ్యాటింగ్లో అద్భుతంగా రాణించామని అన్నాడు. కాగా, తమ జట్టు ఆటగాళ్లు నిలకడగా రాణించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నాడు. భారత్పై టెస్టు సిరీస్, వనే్డ సిరీస్, టీ-20 సిరీస్లలో ఓటమి ద్వారా నేర్చుకున్న గుణపాఠంతో రానున్న బంగ్లాదేశ్ టూర్లో పొరపాట్లు దొర్లకుండా అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తామని పేర్కొన్నాడు.