రాష్ట్రీయం

సున్నిత అంశాలపై మాట్లాడకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 16: రాజకీయ అంశాలు, వివాదాస్పదంగా ఉన్న సున్నితమైన, సమస్యాత్మమైన అంశాలపై మాట్లావద్దని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ తమ దేశ ఆటగాళ్ల సూచించాడు. కాశ్మీర్ అంశంపై తమ దేశ జట్టు ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మియాందాద్ క్రికెటర్లకు సలహా ఇచ్చాడు. ‘క్రికెటర్లు ఎవరైనా రాజకీయ అంశాలపై, సమస్యాత్మక అంశాలపై ప్రకటనలు చేయవద్దు. కేవలం ఆటపైనే దృష్టి సారించండి. రిటైర్మెంట్ తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసుకోండి’ అని సూచించాడు.