క్రీడాభూమి

‘రూర్కీ’ పంచ్ విసిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఏఐబీఏ మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రూర్కీ బాక్సర్ మనీషా వౌన్ ప్రత్యర్థి, అమెరికా బాక్సర్ క్రిస్టియానా క్రుజ్‌పై విజయం సాధించింది. 20 ఏళ్ల హర్యానా బాక్సర్ మనీషా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఆరంగేట్రం చేసిన తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 54 కేజీల విభాగంలో న్యూయార్క్ బాక్సర్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే రెండుసార్లు కాంస్య పతకాలు అందుకున్న 36 ఏళ్ల క్రిస్టియానాపై గెలిచింది. ఈ ఏడాది పోలాండ్‌లో జరిగిన సిలేసియన్ ఉమన్స్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న మనీషా రజత పతకం గెల్చుకుంది. అంతకుముందు ఇండియా ఓపెన్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో ఆదివారం కజగిస్తాన్ బాక్సర్ దినా జోలామన్‌తో మనీషా వౌన్ తలపడుతుంది.