క్రీడాభూమి

ఫైనల్‌కు సైనా నెహ్వాల్, సమీర్ వర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 24: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్ 300లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, సమీర్ వర్మ ఫైనల్‌కు చేరుకున్నారు. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడుసార్లు విజేతగా నిలిచిన రెండో సీడ్ సైనా నెహ్వాల్ ఇండోనేషియాకు చెం దిన రసెల్లీ హర్త్వాన్‌ను 12-21, 21-7, 21-6 తేడాతో ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్, ప్రస్తుత చాంపియన్ సమీర్ వర్మ ఇండోనేషియాకు చెందిన చికో ఔరా డ్వి వార్డోయోను 21-13, 17-21, 21-8 తేడాతో ఓడించాడు. ఫైనల్‌లో ఆరో సీడ్ చైనాకు చెందిన లూ గ్వాంగ్జుతో సమీర్ వర్మ తలపడతాడు. మరోపక్క కామనె్వల్త్ గేమ్స్ కాంస్య పతక విజేతలు అశ్విని పొన్నప్ప-ఎన్.సిక్కిరెడ్డి జోడీ ఫైనల్స్‌కు చేరుకుంది.