క్రీడాభూమి

పృథ్వీ షా కాలికి గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 30: టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా డిసెంబర్ 6 నుంచి ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో శుక్రవారం జరిగిన మూడో రోజు సన్నాహక మ్యాచ్ సందర్భంగా బౌండరీ రోప్ వద్ద బంతిని పట్టుకునే సమయంలో 19 ఏళ్ల పృథ్వీ కాలిమడమకు గాయమైంది. దీంతో డిసెంబర్ 6నుంచి అడెలైడ్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు పృథ్వీ అందుబాటులో ఆడే అవకాశం లేదు. మొదటి టెస్టులో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మురళీ విజయ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే, పృథ్వీ స్థానే ఓపెనర్లుగా ఎవరిని తీసుకుంటారనే విషయం గురించి బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలావుండగా, కాలిమడమతో బాధపడుతున్న యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షాకు అవసరమైన చికిత్స జరిపి పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి ఇచ్చారు.