క్రీడాభూమి

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇక ‘ఢిల్లీ కేపిటల్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటివరకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరుతో ఉన్న జట్టు రానున్న 11వ సీజన్‌లో‘ఢిల్లీ కేపిటల్స్’గా మారనుంది. ఫ్రాంచైజీ సహ యజమానులు పార్థ్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్, కిరణ్ కుమార్ (జీఎంఆర్) సమష్టిగా మారిన కొత్త జట్టు లోగోను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. గత ఏడాది వరకు ఢిల్లీ ఫ్రాంచైజీలో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్‌కు 50 శాతం వాటా ఉంది. పేరు మారిన ఈ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడు. ఐపీఎల్ 10వ సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించిన శిఖర్ ధావన్ వచ్చే సీజన్‌కు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న విషయం తెలిసిందే.