క్రీడాభూమి

యూముంబా మరో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్): ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-6 పూల్ ఏ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూ ముంబా జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యూ ముంబా జట్టు 44-19 పాయింట్లతో దబాంగ్ ఢిల్లీ జట్టును చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబా జట్టు ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధితిపత్యాన్ని ప్రదర్శించింది. జట్టులో స్టార్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ రైడింగ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి సూపర్‌టెన్ సాధించాడు. జట్టు కెప్టెన్ ఫాజల్, అత్రాచల్లీ, సురేంద్ర సింగ్, రాణా డిఫెన్స్‌లో చక్కని ఆటని ప్రదర్శించి ప్రత్యర్థి రైడర్లను కట్టడి చేశారు.
ఈ మ్యాచ్ విజయంతో యూ ముంబా జట్టు 20 మ్యాచ్‌ల్లో 15 విజయాలు సాధించి 82 పాయింట్లతో పూల్ ఏ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, యూపీ యోధా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే యోధా జట్టు చివరకు టైటాన్స్‌ను 27-20 పాయిట్లతో ఓడించింది. ఈ ఓటమితో ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలను టైటాన్స్ క్లిష్టతరం చేసుకుంది.

చిత్రం..దబాంగ్ ఢిల్లీ జట్టు ఆటగాళ్లను తప్పించుకుని పాయింట్ సాధిస్తున్న యూ ముంబా ఆటగాడు