క్రీడాభూమి
పైన్ను కోహ్లీ నిందించలేదు:బీసీసీఐ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 19 December 2018
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఆతిధ్య జట్టు కెప్టెన్ టిమ్ పైన్ వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న సమయంలో టీమిండియా కెప్టె న్ విరాట్ కోహ్లీ ఎదురుపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఉభయ జట్ల కెప్టెన్ల మధ్య వాదోపవాదాలు జరిగినట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఖండించింది. కెప్టెన్లిద్దరూ ఎలాంటి క్రీడా నిబంధనలను ఉల్లంఘించలేదని, హద్దులు మీరి ప్రవర్తించలేదని స్పష్టం చేసింది. ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్ కోహ్లీ ఎప్పుడూ అతిగా ప్రవర్తించలేదని పేర్కొంటూ అతనికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది.