క్రీడాభూమి

ముగిసిన సైనా పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, జనవరి 19: మలేషియా ఓపెన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్, 28 ఏళ్ల సైనా నెహ్వాల్ పోరు ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో స్పెయిన్‌కు చెందిన ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ కరొలినా మారిన్ చేతులో 16-21, 13-21 తేడాతో పరాజయం పాలైంది. 2001 సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సైనా 2017 సీజన్‌లో టైటిల్ అందుకుంది. అయితే, శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో ప్రత్యర్థికి గట్టి పోటీనివ్వలేకపోయింది.
40 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో కరొలినా మారిన్‌దే పైచేయి అయ్యింది. వీరిద్దరూ ఇప్పటివరకు 10సార్లు పరస్పరం పోటీపడగా చెరో ఐదుసార్లు విజయం సాధించారు. శనివారం జరిగిన సెమీస్‌లో గెలుపుతో స్పెయిన్ స్టార్ సైనా కంటే మరోసారి ఆధిపత్యంలోకి వచ్చింది.