క్రీడాభూమి
భారత్తో టీ20 సిరీస్కి గప్తిల్ దూరం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వెల్లింగ్టన్, ఫిబ్రవరి 4: వెన్నునొప్పి కారణంగా చివరి వనే్డకు దూరమైన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ కోలుకోకపోవడంతో బుధవారం నుంచి జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు దూరమైనట్లు కోచ్ గ్యారీ స్టీయడ్ పేర్కొన్నాడు. గప్తిల్ వెన్ను నొప్పి కారణంగానే అతడి స్థానంలో చివరి వనే్డకు జిమీ నీషమ్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్లో ఫిబ్రవరి 6న వెల్లింగ్టన్లో మొదటి మ్యాచ్, ఫిబ్రవరి 8న అక్ ల్యాండ్లోని ఈడెన్పార్క్, చివరిదైన మూడో మ్యాచ్ ఫిబ్రవరి 10న హామిల్టన్లో జరుగుతాయి. ఈ మేర కు టీ20లో పాల్గొనే జట్టును న్యూజి లాండ్ ప్రకటించింది.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియ మ్సన్ (కెప్టెన్), డౌగ్ బ్రాస్వెల్, కొలిన్ డీగ్రాండ్హోం, లాకీ ఫెర్గూసన్, స్కాట్ కుగ్గేలైజిన్, డరియల్ మిచెల్, కొలిన్ మున్రో, జిమీ నీషమ్, మిచెల్ సాంత్నార్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోదీ, టిమ్ సౌథీ, రాస్ టేలర్.