క్రీడాభూమి

మళ్లీ కోహ్లీనే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫస్ట్ ర్యాంక్‌ను పదిలపరుచుకున్నాడు. భారత క్రికెటర్ చటేశ్వర్ పుజారా ఈ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో 992 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 897 పాయింట్లతో నిలిచాడు. 881 పాయింట్లతో భారత క్రికెట్ చటేశ్వర్ పుజారా మూడో స్థానంలో ఉన్నాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లోని తొలి 10 స్థానాల్లో టీమిండియా క్రికెటర్లలో కోహ్లీ, పుజారా మినహా మిగిలినవారెవరూ చోటు దక్కించుకోలేకపోయారు. ఇక బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో భారత జట్టులోని రవీంద్ర జడేజా 794 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.