క్రీడాభూమి
మూడు వారాల సమయం ఎక్కువ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 February 2019
కోల్కతా, ఫిబ్రవరి 19: ప్రపంచకప్కు ముందు ఐపీఎల్ 12 ఎడిషన్ ఉండడం, దీంతో ఆటగాళ్లకు తగిన సమయం ఉండదని బీసీసీఐ భావించింది. ఐపీఎల్లో పాల్గొనే భారత ఆటగాళ్లకు ముఖ్యమైన మ్యాచ్లు మినహా కొన్ని మ్యాచ్ల్లో విశ్రాంతినిచ్చేందుకు ఐపీఎల్ నిర్వాహకులతో చర్చించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్ మంగళవారం దీనిపై స్పందించారు. ఐపీఎల్కు ప్రపం చకప్కు మూడు వారాల సమయం ఉంటుందని తెలిపా రు. మే 12న ఐపీఎల్ ఫైనల్ ముగుస్తుందని, భారత్ జూన్ 5న తన మొదటి మ్యాచ్ ఆడుతుందని గుర్తుచేశాడు. ఆటగాళ్లకు ఈ సమయం సరిపోతుందని చెప్పాడు. కాగా, కేకేఆర్ జట్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో పాటు దినేష్ కార్తీక్ ఉన్నారు.