క్రీడాభూమి

తొలి మ్యాచ్ ఆదాయం అమరుల కుటుంబాలకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: ఢిల్లీ కేపిటల్ జట్టు తమ సొంత మైదానంలో జరిగే తొలి మ్యాచ్ ఆదాయాన్ని పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇస్తామని జట్టు యాజమాన్యం ప్రకటించింది. మన సీఆర్‌ఫీఎఫ్ జవాన్లపై జరిగిన పిరికిపంద దాడి మమ్మల్ని చాలా బాధించింది. వారు చేసిన త్యాగానికి వెలకట్టలేం. కానీ వారి కుటుంబా లను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతు సాయాన్ని అందించాలని కోరుతున్నాం. జైహింద్. అంటూ ఓ ఫొటోని ఢిల్లీ కాపిటల్స్ జట్టు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.