క్రీడాభూమి

విశాఖ చేరిన భారత్, ఆస్ట్రేలియా జట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 22: సిరీస్ తొలి టీ-20 మ్యాచ్‌లో పోటీ పడుతున్న భారత్, ఆస్ట్రేలియా జట్లు శుక్రవారం విశాఖ చేరుకున్నాయి. భారత్ జట్టు క్రికెటర్లు ఎవరికి వారు విడివిడిగా వివిధ ఫ్లైట్లలో రాగా, ఆస్ట్రేలియా జట్టు మాత్రం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంది. విమానాశ్రయంలో ఆతిథ్య జట్టుకు ఏసీఏ ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. గురువారమే విశాఖ చేరుకున్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో బాటు ముంబయి నుంచి మధ్యాహ్నం వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న ఉమేష్ యాదవ్ ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మ్యాచ్‌కు వేదికైన ఏసీఏ-వీడీసీఏ బి గ్రౌండ్‌లో నెట్స్‌లో చెమటోడ్చారు. మిగతా జట్టు సభ్యులందరూ హోటల్ గదులకే పరిమితమయ్యారు. భారత్ జట్టు శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, ఆస్ట్రేలియా జట్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటాయి.