క్రీడాభూమి
నిరాశ పడాల్సిన పనిలేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జైపూర్: వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయనంత మాత్రాన నిరాశ పడాల్సిన పనిలేదని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై కోహ్లీ సేన పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ప్రారంభ మ్యాచుల్లో ఓడిపోయనా నిరాశ పడాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే మ్యాచ్ల్లో తప్పకుండా గెలుస్తామ ని ధీమా వ్యకం చేశాడు. గత మ్యాచ్లో కొన్ని పొరపాట్లు చేశామని, వాటిని పునరా వృతం కానివ్వమని చెప్పాడు. ఈ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టుకు గట్టి పోటీనిచ్చామని, మరో 20 పరుగులు చేసుంటే ఫలితం మరో విధంగా ఉండేదని పేర్కొన్నాడు. కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓ డిపోయింది
చిత్రం.. విరాట్ కోహ్లీ