క్రీడాభూమి

హైదరాబాద్‌లోనే ఐపీఎల్ ఫైనల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోనే నిర్వహించ నున్నారు. అలాగే ప్లే ఆఫ్‌లోని రెండు మ్యాచ్ లు విశాఖ వేదికగా జరగనున్నాయి. ఐపీఎల్ నియామవళి ప్రకారం గత సీజన్ విజేతగా నిలిచిన జట్టు సొంత మైదానం చెన్నైలో జరగా లి. కానీ టీఎన్‌సీఏ (తమిళనాడు క్రికెట్ అసోసియేషన్) చెపాక్‌లోని ఐ, జే, కే స్టాండ్ల ను తెరిచేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానమైన ఉప్పల్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలో మే 7న క్వాలిఫయర్-1, విశాఖలో మే 8 ఎలిమినేటర్, మే 10 క్వాలిఫయర్-2 నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫ యర్-2 హైదరాబాద్‌లో జరగాలి. కానీ మే 6, 10, 14న పరిషత్ ఎన్నికల సందర్భంగా పోలీస్ బలగాలు అందు బాటులో ఉండడం కష్టం. భద్రత సమస్యల దృష్ట్యా ఈ మ్యా చ్‌లను విశాఖకు తరలించారు. ఇక మహిళలకు సంబంధించిన మ్యాచ్‌లు జైపూర్ వేదికగా జరుగుతాయి.