క్రీడాభూమి
మహిళల హాకీ.. కొరియాపై భారత్ గెలుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 May 2019
జించియాన్, మే 20: మూడు మ్యాచ్ల దక్షిణ కొరియా టూర్ను భారత మహిళల హాకీ జట్టు ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్ని 2-1 తేడాతో గెల్చుకొని, సిరీస్పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మ్యాచ్ 20వ నిమిషంలో యువ స్ట్రయికర్ లాల్రెమ్సియామీ భారత్కు తొలి గోల్ అందించగా, 40వ నిమిషం లో నవ్నీత్ కౌర్ రెండో గోల్ను సాధించిపెట్టింది. మొదటి నుంచి చివరి వరకూ వ్యూహాత్మకంగా ఆడిన భారత్ రక్షణ వలయాన్ని 48వ నిమిషంలో ఛేదించిన కొరియా క్రీడాకారిణి షిన్ హేజియాంగ్ తన జట్టుకు ఒక గోల్ను సంపాదించిపెట్టింది. అయితే, ఆతర్వాత ఈక్వెలైజర్ను నమోదు చేయడంలో విఫలమైన కొరియా పరాజయాన్ని ఎదుర్కొంది.