క్రీడాభూమి

10 మంది బాక్సర్లకు పతకాలు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మే 20: ఇండియన్ ఓపెన్ బాక్సిం గ్ టోర్నమెంట్‌లో 10 మంది భారత బాక్సర్లు తమతమ విభాగాల్లో పతకాలను ఖాయం చే సుకున్నారు. వీరంతా సెమీ ఫైనల్స్ చేరారు. గెలి స్తే ఫైనల్ చేరతారు. ఒకవేళ ఓడిపోయి సెమీస్ నుంచే నిష్క్రమించినా, అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిబంధనల ప్రకారం కాంస్య పతకా న్ని అందుకుంటారు. సెమీస్ చేరిన బాక్సర్లలో ఆరుగురు పురుషులుకాగా, నలుగురు మహిళ లు. బ్రిజేష్ యాదవ్, సంజయ్ పురుషుల 81 కిలోల విభాగంలో సెమీస్ చేరారు. నమన్ తన్వ ర్, సంజీత్ 91 కిలోల విభాగంలో, సతీష్ కు మార్, అతుల్ థాకూర్ +91 కేటగిరిలో సెమీస్‌లోకి అగుగుపెట్టారు. మహిళల 69 కిలోల విభాగంలో లలీనా బొర్గొహైన్, అంజలి సెమీస్ చేరి, పతకాలను రిజర్వ్ చేసుకున్నారు. 75 కిలోల వి భాగంలో భాగ్యవతి కచారీ, స్వీటీ బూరా సెమీస్‌లోకి అడుగుపెట్టారు. మహిళల 51 కిలోల విభాగంలో మేరీ కోమ్, నిఖత్ జరీన్ కూడా సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.