క్రీడాభూమి

వనే్డల్లో ధోనీని మించిన ఆటగాడు లేడు : రవిశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, మే 21: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్‌ని మించిన ఆటగాడే లేడని టీమిండియా కోచ్ రవిశాస్ర్తీ కొనియాడారు. ముంబయ కెప్టెన్ కోహ్లీతో కలిసి మీడి యాతో మాట్లాడిన రవిశాస్ర్తీ ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు రాణిస్తే ప్రపంచకప్ భారత్‌దేనని అభిప్రాయప డ్డాడు. ఒత్తిడిని అధిగమించడమేనన్న కెప్టెన్ కోహ్లీ వ్యా ఖ్యాలను సమర్థిస్తూ ఈ విషయంలో ధోనీకి సాటిలే రన్నాడు. మైదానంలో అతడు చేసే కొన్ని పనులు ఆట ను పూర్తిగా మార్చేస్తాయని పేర్కొన్నాడు. ఈ ప్రపం చకప్‌లో ధోనీ కీలకపాత్ర పోషిస్తాడనే ఆశాభావం వ్య క్తం చేశాడు. కెప్టెన్ కోహ్లీ, ధోనీ మధ్య కమ్యూనికేషన్ జట్టుకు ఉపయోగపడుతుందన్నాడు. ఐపీఎల్‌లో వికెట్ల వెనుక ధోనీ చురుగ్గా స్పందించిన తీరు, హిట్టింగ్ చేసి న విధానాన్ని ఈ సందర్భంగా రవిశాస్ర్తీ గుర్తుచేశాడు. కేదార్ జాదవ్ గత కొన్నాళ్లుగా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడని, అతడు గాయం నుంచి తిరిగి కోలుకో వడం శుభపరిణామమన్నాడు. చివరి 10 ఓవర్లు జాగ్ర త్తగా ఆడడం, ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడ డం ముఖ్యమని రవిశాస్ర్తీ అభిప్రాయపడ్డాడు.