క్రీడాభూమి

భారత్‌కు మరో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూన్ 7: ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం రష్యాను 10-0 తేడాతో చిత్తుచేసిన భారత్ శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లో పోలాండ్‌పై 3-1 ఆధిక్యంతో గెలిచింది. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ 21వ నిమిషంలో అతను తొలి గోల్ చేసి, భారత్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. అయితే, మరో ఐదు నిమిషాల్లోనే పోలాండ్‌కు డామినిక్ కొటూల్‌స్కీ ఈక్వెలైజర్‌ను అందించాడు. 27వ నిమిషంలో మన్‌ప్రీత్ మరో గోల్ సాధించాడు. 36వ నిమిషంలో మన్దీప్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆతర్వాత ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. భారత్ అదే తేడాతో విజయాన్ని నమోదు చేసింది.