క్రీడాభూమి
ఆస్ట్రేలియా మహిళలదే సిరీస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సిడ్నీ, సెప్టెంబర్ 30: సొంత గడ్డపై ఆస్ట్రేలియా మహిళా జట్టు చెలరేగిపోయంది. శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యా చ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో టీ20లో 9 వికెట్ల తేడా తో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యా టింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 84 పరుగులు చేసింది. శశికళ సిరివర్దనే (19) జట్టులో టాప్ స్కోర ర్గా నిలవగా, కెప్టెన్ చమరి ఆటపట్టు (16), అమ కాంచన (16, నాటౌట్), హర్షిత మాధవి (12) మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా మహిళలు మరో 62 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బేత్ మనీ (28, నాటౌట్), వికెట్ కీపర్ అలీసా హేలీ (21), ఎరిన్ బర్న్స్ (30) రాణించారు. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఆస్ట్రేలియా మహిళా జట్టు 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 అక్టోబర్ 2న సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్తో అలీసా హేలీ 100 టీ20 మ్యాచ్లను పూర్తిచేసుకున్న రెండో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది.