క్రీడాభూమి

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలొంబో, అక్టోబర్ 17: ఆస్ట్రేలి యాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును గురువారం ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి మ్యా చ్ ఈ నెల 27న ఆడిలైడ్ వేదికగా జర గనుండగా, రెండో టీ20 బ్రిస్బేన్స్, చి వరిదైన మూడో మ్యాచ్ మెల్‌బోర్న్ వే దికగా జరగనున్నాయ. శ్రీలంక జట్టు ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. అయతే భద్రతా రీత్యా టీ20 కెప్టెన్ లసిత్ మలింగ, సీ నియర్ ఆటగాళ్లు కుశల్ పెరీరా, నిరో షన్ డిక్వెల్లా వంటి ఆటగాళ్లు ఎవరూ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. దీంతో లంక బోర్డు జూనియర్ జట్టును పంపించింది. అయతే పాక్ పర్యటన లో వనే్డ సిరీస్‌ను కోల్పోయన లంక టీ20 సిరీస్‌ను మాత్రం క్లీన్‌స్వీప్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.
శ్రీలంక జట్టు: లసిత్ మలింగ (కెప్టెన్), కుశల్ పెరీరా, కుశల్ మెం డిస్, దిన్షుక గుణతిలక, అవిష్కా ఫె ర్నాండో, నిరోషన్ డిక్వెల్లా, డసన్ షన క, షెహన్ జయసూరియ, బానుక రాజపక్స, ఒశాడ ఫెర్నాండో, వాహిదు హసరంగ, లక్షన్ సందకన్, నువాన్ ప్రదీప్, లహీరు కుమార, ఇసూరు ఉదాన, కసున్ రజిత.