క్రీడాభూమి

టీమిండియా మేనేజర్‌గా రమేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 2: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) సెంట్రల్ జోన్ కార్యదర్శి కె. రమేష్ జింబాబ్వే పర్యటనకు వెళ్లే టీమిండియాకు మేనేజర్‌గా నియమితులయ్యారు. భారత జట్టు జింబాబ్వేలో ఈ నెల 11 నుండి మూడు వనే్డలు, మూడు టి 20 మ్యాచ్‌లు ఆడనుంది. 2012 కౌలాలంపూర్‌లో పర్యటించి ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న అండర్-19 భారత జట్టుకు రమేష్ మేనేజర్‌గా వ్యవహరించడమే కాకుండా సౌత్‌జోన్ అండర్-16, 19 జట్లకు కోచ్, మేనేజర్‌గా వ్యవహరించారు.
సచిన్‌ను కలిసిన శాప్ చైర్మన్
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ తెండూల్కర్‌ను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ పిఆర్ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచిన్‌ను కలిసిన ఆయన శ్రీకాళహస్తీశ్వరస్వామి తీర్థ ప్రసాదాలను అందజేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీడ్కోలు పలికారు.

chitram కె. రమేష్