క్రీడాభూమి

హర్మన్‌ప్రీత్ సేన మరో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయానా, నవంబర్ 18: వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు మరో విజయం అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి న వెస్టిండీస్ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, వర్షం కారణంగా 9 ఓవర్లకే కుదించిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 50 పరుగులు చే సింది. పూజా వస్త్రాకర్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేసింది. విండీస్ బౌలర్లలో హెలీ మాథ్యూస్ మూడు వికెట్లు తీసుకోగా, అఫీ ఫ్లేచర్, షీనీటా గ్రీమాండ్‌కు రెండేసి వికెట్లు దక్కాయ. ఆ తర్వాత లక్ష్య ఛేదన లో విండీస్ 5 వికెట్లు కోల్పోయ 45 పరుగులు మాత్రమే చేసి 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. హేలీ మాథ్యూ స్ (11), చినెల్లీ హెన్రీ (11) నటాషా మెక్‌లియాన్ (10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అనూజా పాటిల్ రెండు వికెట్లు తీయగా, దీప్తి శర్మ, రాధా యాదవ్‌కు చెరో వికెట్ దక్కిం ది. ఈ విజయంతో భారత మహిళా జట్టు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-0 తేడాతో ముందుంది.

*చిత్రం...అనూజా పాటిల్