క్రీడాభూమి

భారత్‌తో అలీకి ఎనలేని అనుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: మహమ్మద్ అలీకి భారత్‌తో ఎంతో అనుబంధం ఉంది. 1980 జనవరి 31న అతను మద్రాసు (నేటి చెన్నై)లో మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ జిమీ ఎలిస్‌తో కలిసి ఎగ్జిబిషన్ ఫైట్‌లో పాల్గొన్నాడు. ఆ పోటీకి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్‌లో తనకు లభించిన ఆదరణను అలీ చాలా సందర్భాల్లో గుర్తుచేసుకున్నాడు. ‘మీనంబాకం విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు వేలాది మంది అభిమానులు నాకు అభినందనలు తెలుపుతూ హర్షధ్వానాలు చేయడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జీవితాంతం నా జ్ఞాపకాల దొంతరలో పదిలంగా దాచుకునే సందర్భమది. ఓపెన్ కారులో నేను హోటల్ గదికి చేరుకునే వరకూ రోడ్డుకు ఇరువైపులా ఎంతో మంది అభిమానులు నిలబడి నాకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ దృశ్యాన్ని నేను ఎన్నటికీ మరచిపోలేను’ అని అలీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.