క్రీడాభూమి

అదరగొట్టిన అమ్మాయిలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయానా, నవంబర్ 21: కరేబియన్ పర్యటనలో టీమిండియా మహిళా జట్టు అదరగొట్టింది. సొంత గడ్డపై వెస్టిండీస్ జట్టును దారుణంగా ఓడించి, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో గెలుచుకుంది. చివరి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్‌ప్రీత్ సేన బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (9), స్మృతీ మంధాన (7) విఫలమైనా, జెమీమా రోడ్రిగ్స్ (50), వేదా కృష్ణమూర్తి (57, నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయ 134 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్, కెప్టెన్ అనీషా మహ్మద్, అలియా అలెనీకి తలో వికెట్ దక్కింది. అనంత రం లక్ష్య చేధనలో విండీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయ 73 పరుగులు మాత్రమే చేసి దారుణంగా ఓడిపోయంది. ఓపెర్ కిషోనా నైట్ (22), వికెట్ కీపర్ షిమైన్ క్యాంప్‌బెల్ (19, నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు భారత్‌తో వైట్‌వాష్‌కు గురైనట్లయంది.