క్రీడాభూమి
ధోనీలా ఫినిష్ చేయాలని ఉంది..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, జనవరి 12: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీలా మ్యాచ్లను ఫినిష్ చేయాలని అనుకుంటున్నానని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా క్యారీ మాట్లాడుతూ ధోనీ అద్భుతమైన మ్యాచ్ ఫినీషరని, చివరి వరకు క్రీజు లో ఉండి, జట్టును గెలిపిస్తాడన్నాడు. తాను కూడా అలాగే ఆడాలనుకుంటు న్నానని, అందుకు తన బ్యాటింగ్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉం టుందన్నాడు. మంగళవారం నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య మంగళవా రం నుంచి మూడు వనే్డల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ విషయమై క్యారీ మాట్లాడుతూ భారత్ పిచ్లో ఆడడం చాలా కష్టమని, స్పిన్తో పా టు ప్రపంచ శ్రేణి బౌలర్లున్నారన్నాడు. అయతే తమ జట్టులోనూ డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, లబుషేన్, స్టీవ్ స్మిత్ వంటి అగ్రశ్రేణి బ్యాట్స్మన్లు ఉండడంతో భారత్కు గట్టి పోటీ నిస్తామని పేర్కొన్నాడు.
'చిత్రం... ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ