క్రైమ్/లీగల్

గిరిజన మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూలై 9 : గిరిజన మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను దారుణంగా గొంతుకోసి చంపేశారు. ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన పట్టణ శివారు ప్రాంతంలో సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దగదర్తి మండలం కాట్రాయపాడు గ్రామానికి చెందిన గందళ్ల శేషమ్మ (45) ఆత్మకూరు శివారు ప్రాంతంలోని అనంతరాయేని ఎస్సీ కాలనీలో ఉంటున్న పుట్టింటికి ఆదివారం వచ్చింది. కాలనీ సమీపంలో తిరునాళ్ల జరుగుతుండటంతో అక్కడికి వెళ్లి తిరిగి రాలేదని మృతురాలి తల్లి తుపాకుల భాగ్యమ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ఎవరూ శత్రువులు లేరని ఆమె పేర్కొన్నారు. ఈ హత్య ఉదంతంపై ఆత్మకూరు ఏఎస్‌ఐ విక్రమ్ మాట్లాడుతూ సంఘటన ఆదివారం రాత్రి జరిగి ఉండవచ్చని తెలిపారు. తెల్లవారి పొలాల్లో పశువుల కాపరులు గుర్తించడంతో విషయం వెలుగు చూసిందన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు శేషమ్మను దారుణంగా గొంతుకోసి హతమార్చారని తెలిపారు. మృతదేహం పక్కనే హద్దు రాయిపై ఉన్న రక్తం మరకలను బట్టి మృతురాలిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. సంఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టారా, లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనేది విచారణలో తేలుతుందన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలేది లేదన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.