క్రీడాభూమి

ఇండోనేషియా మాస్టర్స్ బాడ్మింటన్ ఫైనల్‌కు శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలాంగ్, డిసెంబర్ 5: భారత స్టార్, తెలుగు వీరుడు కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్‌లో అతను గింటింగ్ ఆంథోనీపై 21-13, 21-19 తేడాతో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ కేవలం 37 నిమిషాల్లోనే పూర్తి కావడం గమనార్హం. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్‌కు మొదటి సెట్‌లో ఏమాత్రం పోటీనివ్వలేకపోయిన ఆంథోనీ రెండో సెట్‌లో తీవ్ర స్థాయిలో ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా, ఫైనల్‌లో టైటిల్ కోసం రెండో సీడ్ టామీ సుగియార్తోతో శ్రీకాంత్ తలపడతాడు. రెండో సెమీ ఫైనల్‌లో సుగియార్తో 21-18, 21-18 స్కోరుతో విస్ను యులీ ప్రసెత్యోపై గెలుపొందాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో చెన్ యుఫెయ్ 19-21, 21-17, 21-18 ఆధిక్యంతో మూడో సీడ్ కిమ్ హ్యోమిన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఆమెకు టైటిల్ పోరులో హి బిజియావో ఎదురుకానుంది. రెండో సెమీ ఫైనల్‌లో బిజియావో 21-9, 21-10 స్కోరుతో హెరా డెసీపై సునాయాసంగా గెలిచింది.