రాష్ట్రీయం

వేడుకగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 24: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్మేలా ఏర్పాటు చేసిన అష్టలక్ష్మీ మండపంలో మంగళవారం శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ వైశాఖ శుద్ధ దశమి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతీని శ్రీవేంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఆనాటి కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా 1992 నుండి ప్రతి వైశాఖ శుద్ద దశమి నాటికి ముందు ఒకరోజు, తరువాత ఒకరోజు కలిపి మొత్తం మూడు రోజులపాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోందన్నారు. శ్రీ మలయప్ప స్వామివారు తొలిరోజు గజ వాజహనం, రెండవ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేస్తారని వివరించారు.
మొదటిరోజు వైశిష్ట్యం
శ్రీ పద్మావతీ పరిణయోత్సవాల్లో మొదటిరోజు వైశాఖ శుద్ధ నవమి రోజైన మంగళవారం శ్రీ మలయప్పస్వామి గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు. స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్రాల సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత జరిగిన స్వామివారి కొలువులో సర్వజగత్ప్రభువైన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి వేదాలు, పురాణాలు, సంగీత రాగాలు, కవితలు, నృత్యాలు నివేదించారు. అనంతరం ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సహితుడైన స్వామి బంగారు తిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.
పరిణయ మండపాన్ని ఆపిల్, నారింజ, ద్రాక్ష, మొక్కజొన్న కంకులు, అనాసపండ్లు, అరటి, మామిడి కొమ్మలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మండపం అలంకరణలకు బంతి, చామంతి, వట్టివేరు, వాడామల్లి, నాలుగు రంగుల రోజాలు, ఆర్కుట్, కార్నస్ తదితర పుష్పాలను వినియోగించారు. మొత్తం 4 టన్నుల ఫలాలు, ఒక టన్ను సంప్రదాయ పుష్పాలు, 20వేల కట్‌ఫ్లవర్స్ వినియోగించారు. మధ్యమధ్యలో క్రిస్టల్‌బాల్స్, షాండ్లియర్లు, వెన్నముంతలు వేలాడదీశారు. మండపంలోని ప్రధాన స్తంభాలకు చిన్నికృష్ణుడు, వెన్నకృష్ణుడి బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ మండపం అలంకరణకు పూణేకు చెందిన శ్రీవేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వారు టీటీడీకి విరాళం అందించారు. ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అత్యంత మనోహరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ హరీంద్రనాథ్, వీఎస్‌ఓ రవీంద్రారెడ్డి, ఆలయ ఓఎస్‌డీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు గురురాజారావు పాల్గొన్నారు.

చిత్రం..తిరుమలలో మంగళవారం శ్రీ పద్మావతీ పరిణయోత్సవాన్ని నిర్వహిస్తున్న పురోహితులు